News April 1, 2024

HYD: ఆస్తి పన్ను రూ.1914.87 కోట్లు వసూలు

image

ఆస్తి పన్ను వసూళ్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలం మయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్‌ను కమిషనర్ ఖరారు చేయగా.. దాదాపుగా రూ.1914.87 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 90 శాతం వడ్డీ
రాయితీతో ఓటీఎస్ స్కీంను తీసుకొచ్చారు. అయినా కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై మీ కామెంట్.

Similar News

News March 8, 2026

సిటీ స్కైలైన్’ పిక్నిక్: ఫ్లైఓవర్ల కింద ఫాస్ట్ ఫుడ్!

image

నగరంలోని కొత్త ఫ్లైఓవర్ల కింద ఇప్పుడు వింతైన ‘డిన్నర్’ పార్టీలు జరుగుతున్నాయి. ఖరీదైన హోటళ్లకు వెళ్లే బదులు, బయోడైవర్సిటీ, షేక్‌పేట్ ఫ్లైఓవర్ల కింద బైకులు ఆపి, రోడ్డు పక్కన దొరికే బండి మీద తిండి తింటూ గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. ట్రాఫిక్ వెలుగుల మధ్య, వాహనాల హడావుడిని చూస్తూ గడపడమే ఒక ‘అర్బన్ అడ్వెంచర్’ అని వీరు భావిస్తున్నారు. ఈ ‘స్ట్రీట్ సైడ్’ లైఫ్ స్టైల్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

News March 8, 2026

HYD: ‘కార్యేషు దాసి’.. ‘అర్ధాంగి’కి నిలువెత్తు రూపాలు..!

image

ఆ అన్నదమ్ములను విధి పక్షవాతం రూపంలో వెంటాడింది. ఘట్‌కేసర్‌ అంకుషాపూర్‌కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితయ్యారు. కాగా, వీరి భార్యలు భవానీ, సంధ్య భర్తలకు కన్నతల్లిలా సేవలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ అన్న ఆర్యోక్తిని వీరు నిజం చేసి చూపిస్తున్నారు. అర్ధాంగులు అన్న అర్థానికి జీవం పోస్తున్నారు.

News March 8, 2026

HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.