News August 16, 2025
యూరియా కొరతతో ప్రకాశం రైతుల అవస్థలు

ప్రకాశం జిల్లాలో పలుచోట్ల యూరియా అందుబాటులో లేదు. త్రిపురాంతకం మండల పరిధిలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలతోపాటు గ్రోమోర్ సెంటర్లలో యూరియా అందుబాటులోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమౌతున్న రైతులకు యూరియా లేకపోవడం సాగుకు ఇబ్బందిని కలిగిస్తుంది. బయట దుకాణాల్లో ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు.
Similar News
News August 17, 2025
ఒంగోలు: ఘాట్ రోడ్లలోనూ FREE బస్

శ్రీశైలం, నంద్యాల ఘాట్ రోడ్లలోనూ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకాశం జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులో ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఘాట్ రోడ్లలో సీట్లు ఖాళీగా ఉన్నంత వరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలని కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
News August 17, 2025
యూరియా కొరతతో ప్రకాశం రైతుల అవస్థలు

ప్రకాశం జిల్లాలో పలుచోట్ల యూరియా అందుబాటులో లేదు. త్రిపురాంతకం మండల పరిధిలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలతోపాటు గ్రోమోర్ సెంటర్లలో యూరియా అందుబాటులోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమౌతున్న రైతులకు యూరియా లేకపోవడం సాగుకు ఇబ్బందిని కలిగిస్తుంది. బయట దుకాణాల్లో ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు.
News August 16, 2025
ఒంగోలులో సందడిగా ఎట్ హోమ్ కార్యక్రమం

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు.