News August 16, 2025
తిరుమలకు ఫ్రీ బస్ స్కీమ్ వర్తించదు: అధికారులు

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ <<17369759>>బస్<<>> స్కీమ్ వర్తించదని తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, గరుడ ఏసీ, ప్యాకేజీ టూర్ సహా మరే బస్సులకు ఈ పథకం వర్తించదన్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ స్కీమ్ లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు.
Similar News
News August 17, 2025
నేటి నుంచి రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బిహార్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టనున్నారు. ఇది ససరాం నుంచి ప్రారంభమై 16రోజుల పాటు 25 జిల్లాల మీదుగా సాగనుంది. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ తమ విధానమని చెబుతున్న రాహుల్.. బిహార్లో SIRను వ్యతిరేకిస్తూ యాత్రకు సిద్ధమయ్యారు. 1,300KM మేర సాగే ఈ యాత్ర కొంతదూరం కాలినడకన, మరికొంత దూరం వాహనంపై హైబ్రిడ్ మోడల్లో సాగనుంది. మహాఘట్ బంధన్ నేతలు ఇందులో పాల్గొననున్నారు.
News August 17, 2025
నేడే లాస్ట్.. IBలో 4,987 ఉద్యోగాలు

కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల <
News August 17, 2025
నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

APలో నేటి నుంచి 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. TGలోని కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని IMD తెలిపింది.