News August 16, 2025
విశాఖలో బంగారం చోరీ

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్లో శనివారం చోరీ జరిగింది. సెక్టార్ 6, 105/bలో నివాసం ఉంటున్న డీజీఎం నల్లి సుందరం తన భార్యతో కలిసి బయటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు. ఇంట్లో 24 తులాల బంగారం చోరీకి గురికాగా మరో 40 తులాల బంగారం బిరువాలోనే ఉన్నట్లు తెలిపారు.
Similar News
News August 17, 2025
విశాఖలో ఒ’క్కో’ చోట ఒ’క్కో’లా నాన్ వెజ్ ధరలు

విశాఖలో నాన్ వెజ్ ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. అక్కయ్యపాలెంలో కేజీ మటన్ రూ.900-1000 మధ్య ఉండగా.. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్ రూ.230గా ఉంది. తాటిచెట్లపాలెంలో కేజీ మటన్ కొన్ని షాపుల్లో రూ.900 ఉండగా.. మరికొన్ని షాపుల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230, స్కిన్ రూ.220గా ఉంది. డజన్ గుడ్లు ధర రూ.66గా ఉంది.
News August 16, 2025
విశాఖ ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి

విశాఖ నగరంలో భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే జీవీఎంసీ అప్రమత్తంతో ప్రత్యేక చర్యలను చేపట్టిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఇళ్లలో విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, శిథిలావస్థ భవనాల్లో ఉండరాదని కమిషనర్ సూచించారు. ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే జీవీఎంసీ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009కు సమాచారం అందించాలని కోరారు.
News August 16, 2025
పెందుర్తిలో అత్యధిక వర్షపాతం నమోదు

పెందుర్తిలోని అత్యధికంగా వర్షపాతం నమోదయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనీ 66.4 మీ.మీ.వర్షపాతం నమోదయింది. పద్మనాభంలో 28.6 మీ. మీ, ఆనందపురం 15.6 మీ.మీ, ములగాడ 8.2 మీ.మీ., గోపాలపట్నం 7.4 మీ. మీ, విశాఖపట్నం రూరల్ 6.8.మీ.మీ వర్షం పడింది. ఇల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 162.0 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.