News August 16, 2025

గుంటూరులో విషాదం.. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య

image

గుంటూరులోని సాయిబాబా నగర్‌లో దారుణం జరిగింది. నరసరావుపేటలో ఆటో డ్రైవర్‌‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు మగ పిల్లలను తీసుకుని శనివారం సాయిబాబా నగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News August 17, 2025

నిజామాబాద్: రూ. 57.98 కోట్ల పెన్షన్ల పంపిణీ

image

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.

News August 17, 2025

విశాఖలో ఒ’క్కో’ చోట ఒ’క్కో’లా నాన్ వెజ్ ధరలు

image

విశాఖలో నాన్ వెజ్ ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉన్నాయి. అక్కయ్యపాలెంలో కేజీ మటన్ రూ.900-1000 మధ్య ఉండగా.. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.240, స్కిన్ రూ.230గా ఉంది. తాటిచెట్లపాలెంలో కేజీ మటన్ కొన్ని షాపుల్లో రూ.900 ఉండగా.. మరికొన్ని షాపుల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230, స్కిన్‌ రూ.220గా ఉంది. డజన్ గుడ్లు ధర రూ.66గా ఉంది.

News August 17, 2025

NZB: మహాలక్ష్మీ పథకం కింద ఎన్ని కోట్లు ఆదా ఆంటే?

image

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ మహాలక్ష్మి పథకం మహిళా ప్రయాణీకులకు భారీ ఊరటనిచ్చింది. అధికారిక నివేదికల ప్రకారం, పథకం ప్రారంభం నుంచి ఆగస్టు 10 వరకు 6 కోట్ల 8 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీనివల్ల వారికి రూ. 249.13 కోట్లు ఆదాయం ఆదా అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున ప్రతిరోజూ లక్ష మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు.