News August 17, 2025
తాంసి: ఒకరికి తీవ్ర గాయాలు ఆవు మృతి

తాంసి మండలం పొన్నారి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఆవు ఇద్దరు మహిళలను పొడవడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఆవు దాడికి ఆగ్రహించిన అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో ఆవుపై దాడి చేయడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News August 17, 2025
నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. పాలకొండ మండలం అన్నవరంలో బంధువుల ఇంటికి వచ్చిన పవన్ (16) నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. మృతి చెందిన పవన్ ఆమదాలవలస మండలం వజ్రగూడ గ్రామానికి చెందినవాడు. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో ఇటు అన్నవరంలోనూ అటు వజ్రగూడ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
News August 17, 2025
NZB: 638 సంఘాలు.. రూ 72.22 కోట్ల రుణాలు

నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.
News August 17, 2025
ASF: పెండింగ్ కేసులు త్వరగా పూర్తిచేయాలి: ఎస్పీ

పెండింగులో ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాలని, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. శనివారం కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, మత్తుపదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.