News August 17, 2025
సామాన్యులకే తొలి ప్రాధాన్యత: మంత్రి బీసీ

కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Similar News
News August 17, 2025
సైనికులను తయారు చేసే గ్రామం ధనసిరి

సంగారెడ్డి జిల్లాలోని ధనసిరి గ్రామం దేశానికి సైనికులను అందించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి సుమారు 50 మందికి పైగా యువకులు భారత సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించారు. ధనసిరిలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు సైన్యంలో ఉండడం ఈ గ్రామానికి గర్వకారణంగా మారింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సేవలో ఈ గ్రామానికి చెందిన జవాన్లు నిమగ్నమై ఉన్నారు.
News August 17, 2025
మెదడు చురుగ్గా పని చేసేందుకు సింపుల్ ట్రిక్

కొన్ని రకాల పనులకు మీరు రెగ్యులర్గా వాడే చేయికి బదులు అప్పుడప్పుడు మరో చేతిని వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తినడం, వంట చేయడం, పళ్లు తోమడం, ఫోన్ వాడటం, తల దువ్వడం, షార్ట్ నోట్ రాయడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల మెదడు యాక్టివ్, స్ట్రాంగ్ అవుతుందని తెలిపారు. అలాగే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ మెరుగై మెదడు చురుగ్గా పని చేస్తుందని వివరించారు. మీరూ ట్రై చేయండి.
SHARE IT
News August 17, 2025
జ్యోతి మల్హోత్రాపై 2,500 పేజీల ఛార్జిషీట్

పాక్ స్పై, హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై సిట్ 2,500 పేజీల ఛార్జ్షీట్ను హిస్సార్ కోర్టుకు సమర్పించింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఆమెకు ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ థిల్లన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ను కూడా జ్యోతి కలిసినట్లు తెలిపారు.