News August 17, 2025

ఖమ్మంలో రెండు రోజులు పూల వ్యాపారం బంద్

image

ఖమ్మంలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది. బంద్‌కు సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Similar News

News August 17, 2025

తల్లాడ: ‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి’

image

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News August 17, 2025

శంకరగిరి తండాలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

image

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ఆదివారం తీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. బంజారా, లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ముగింపు సందర్భంగా యువతులు నృత్యాలతో సందడి చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.

News August 17, 2025

బోనకల్: సీపీఎం సీనియర్ నాయకుడిని కలిసిన కేరళ ఎమ్మెల్యే

image

బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మాధినేని నారాయణను కేరళ ఎమ్మెల్యే కె.కె.రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం అవసరమని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సీపీఎం నాయకులు పాల్గొన్నారు.