News August 17, 2025
అన్నమయ్య: కొత్త జిల్లాలు.. మీరేమంటారు?

బి.కొత్తకోటకు వచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. ‘పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె డివిజన్లో కలపడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రజల సౌకర్యార్థం మండలాలు, జిల్లాలను విభజిస్తున్నాం. అందరికీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. మరోవైపు మదనపల్లె జిల్లా కావాలని కొందరు, రాజంపేట కేంద్రంగా బద్వేల్ కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News August 18, 2025
KMR: కళకళలాడుతున్న ప్రాజెక్టులు

కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నిండుగా ఉంది. కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్ నాలా, సింగీతం రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నాయి.
News August 18, 2025
శుభ్మన్ గిల్కు BCCI బిగ్ షాక్?

ఆసియా కప్ 2025 కోసం BCCI ప్రకటించే భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు చోటు కల్పించడం లేదని తెలుస్తోంది. టీ20 ప్రణాళికల్లో ఆయన లేకపోవడమే ఇందుకు కారణమని టాక్. అతడికి బదులు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. టీమ్ ఇండియా ప్లేయర్లలో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉండటం కూడా గిల్ను పక్కన పెట్టేందుకు మరో కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
News August 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 18, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.44 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.47 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.40 గంటలకు
✒ ఇష: రాత్రి 7.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.