News August 17, 2025
ఖమ్మం: తగ్గుముఖం పట్టిన మున్నేరు

మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు.
Similar News
News August 17, 2025
తల్లాడ: ‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి’

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News August 17, 2025
శంకరగిరి తండాలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ఆదివారం తీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. బంజారా, లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ముగింపు సందర్భంగా యువతులు నృత్యాలతో సందడి చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.
News August 17, 2025
బోనకల్: సీపీఎం సీనియర్ నాయకుడిని కలిసిన కేరళ ఎమ్మెల్యే

బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మాధినేని నారాయణను కేరళ ఎమ్మెల్యే కె.కె.రామచంద్రన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకుల అనుభవం, మార్గదర్శకత్వం అవసరమని రామచంద్రన్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక సీపీఎం నాయకులు పాల్గొన్నారు.