News August 17, 2025

ఓటు గల్లంతుపై నిరసనలు చేస్తాం: కాంగ్రెస్

image

ఓట్ గల్లంతుపై రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో నిరసనలు చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. నగర కాంగ్రెస్ నేతలతో కలిసి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుతంత్రాలు పాల్పడుతోందని ఆరోపించారు. సెప్టెంబర్1న పాట్నాలో భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Similar News

News August 18, 2025

రేపు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు: డీఈవో

image

విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.

News August 17, 2025

రేపు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు: డీఈవో

image

విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.

News August 17, 2025

సింహాచలంలో 22న ఆర్జిత సేవలు రద్దు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో 22వ తేదీన ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోజు సుప్రభాతం, ఆరాధన, లక్ష కుంకుమార్చన సేవలు మినహా మిగతా ఆర్జిత సేవలు అయిన నిత్య కళ్యాణం, గరుడ వాహన సేవ, సహస్రనామార్చన మొదలైన సేవలను రద్దు చేసినట్టు తెలిపారు.