News August 17, 2025
సిరిసిల్ల: వర్షాలు.. ‘ప్రజావాణి కార్యక్రమం రద్దు’

వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రేపు జరగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ తమ వినతులు తీసుకొని కలెక్టరేట్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు.
Similar News
News August 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్
✓పాల్వంచ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
✓Way2News కథనానికి స్పందన.. సారపాకలో రోడ్లకు మరమ్మతులు
✓మణుగూరులో ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టిన డీసీఎం
✓భద్రాద్రి రామాలయంలో అన్నదానానికి రూ.లక్ష విరాళం
✓సీపీఐ నేత అయోధ్య సంస్మరణ సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం
✓పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు: సీపీఎం
News August 18, 2025
కాచాపూర్: బావిలో దూకి మహిళ ఆత్మహత్య

వ్యవసాయ బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం కాచాపూర్లో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బు శకుంతల (58) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే మతిస్థిమితం కూడా కోల్పోయి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News August 18, 2025
తోటి దర్శకులను ప్రశంసించలేరా?.. నెట్టింట విమర్శలు

రూ.1000 కోట్ల దర్శకులు వినోదం పంచితే తమిళ డైరెక్టర్లు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారన్న దర్శకుడు మురుగదాస్ <<17434441>>వ్యాఖ్యలు<<>> చర్చకు దారి తీశాయి. తోటి దర్శకుల ఘనతను ప్రశంసించలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నెటిజన్లు ఫైరవుతున్నారు. వినోదంతో పాటు అంతర్లీనంగా జీవిత పాఠాలను చెప్పే దర్శకులు ఉన్నారని అంటున్నారు. మురుగదాస్ తీసిన కొన్ని సినిమాలను ప్రస్తావిస్తూ.. వాటితో ఏం ఎడ్యుకేట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.