News August 17, 2025
NZB: 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్హెచ్-44, ఎన్హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.
Similar News
News August 18, 2025
NZB: 12 తులా బంగారు, 30 తులా వెండి ఆభరణాల చోరీ

నిజామాబాద్లోని మహాలక్ష్మినగర్ నాగాటవర్స్లో నివాసం ఉంటున్న విఠల్ ఇంట్లో భారీచోరీ జరిగింది. బాధితుల వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున విఠల్ కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు కిటికీ గుండా ప్రవేశించి బెడ్ రూంకు గడియ పెట్టారు. మరో బెడ్ రూంలోని బీరువాను పగులగొట్టి 12 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
News August 17, 2025
నిజామాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఎన్నంటే?

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇక జనవరి నుంచి పౌర సరఫరా రంగంలో 11,852 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని అధికారులు తెలిపారు. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,19,330 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి ప్రభుత్వం రూ.30.73 కోట్ల సబ్సిడీ అందించిందని వెల్లడించారు.
News August 17, 2025
NZB: 51.50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

నిజామాబాద్ జిల్లాలో 2025-26లో 51.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 27 లక్షల మొక్కలు నాటారు. జిల్లాలో 2,14,056 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది, ఇది జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.86 శాతం. జాతీయ రహదారులు ఎన్హెచ్-44, ఎన్హెచ్-63 వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నట్లు అటవీశాఖ నివేదిక పేర్కొంది.