News August 17, 2025
సిరిసిల్ల: ’శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి’

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలోని గణేష్ మండపం నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీసులు ఆన్లైన్ ద్వారానే గణేష్ మండపాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News August 18, 2025
MBNR: ఓపెన్ SSC, INTER.. ఇవాళే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు నేటితో (ఫైన్ లేకుండా) గడువు ముగుస్తుందని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 28లోగా ఫైన్తో అప్లై చేసుకోవచ్చని, ఆసక్తిగల విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చదువు మానేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT
News August 18, 2025
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News August 18, 2025
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <