News August 17, 2025
సిరిసిల్ల: కార్యకర్త కూతురు వివాహానికి హాజరైన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల(D) గంభీరావుపేట(M) నర్మాలకు చెందిన ద్యనబోయిన నవిత తన పెళ్లికి హాజరు కావాలని ఎమ్మెల్యే కేటీఆర్కు వాట్సాప్లో మెసేజ్ చేసింది. ‘మా నాన్న, అన్న BRS అభ్యున్నతి కోసం కృషిచేశారు. కరోనా కాలంలో నాన్న చనిపోయారు. అన్నయ్య రోడ్డుప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు మాకు ఎవరూ లేరు’ అని KTRకు మెసేజ్ చేసింది. దీంతో KTR ఈ రోజు నవిత పెళ్లికి హాజరై ఆశీర్వదించారు. ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
Similar News
News August 18, 2025
కర్నూలు జిల్లాలో స్కూళ్లకు సెలవులు ఇవ్వరా..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందవరం, దేవనకొండ, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, బనగానపల్లె, ప్యాపిలి సహా ఇతర మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు కూడా సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నాయి. మరి సెలవులు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.
News August 18, 2025
నిజాంపట్నం పోర్టుకు 3వ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్డీఎంఏ ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం పోర్టుకు సోమవారం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 18, 2025
సాలూరు: తల్లి మరణం తట్టుకోలేక తనయుడి సూసైడ్

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాలూరుకు చెందిన తట్టికోట సరస్వతి(80) ఈనెల 8న మరణించారు. ఆమె లేదని మనస్తాపం చెందిన కుమారుడు రామక్రిష్ణ (50) సోమవారం నుంచి కనిపించకపోగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరఘట్టం వద్ద నాగావళి నదిలో శవమై కనిపించాడు. తనకు అండగా ఉండే అమ్మ చనిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.