News August 17, 2025
ముగ్గురు MLAలపై సీఎం తీవ్ర ఆగ్రహం

AP: అనంతపురం <<17432318>>ఎమ్మెల్యేపై<<>> ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సార్లు తప్పు లేకపోయినా, తప్పుడు ప్రచారం జరుగుతున్నా నేతలు వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News August 18, 2025
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News August 18, 2025
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <
News August 18, 2025
బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి షురూ!

బెంగళూరులోని ఫాక్స్కాన్ ప్లాంట్లో ఐఫోన్ 17 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైంది. చెన్నై యూనిట్లో కూడా వీటి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 6 కోట్ల ఐఫోన్లు తయారు చేయాలని ఫాక్స్కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2.8 బిలియన్ డాలర్ల వ్యయంతో బెంగళూరు దగ్గర్లోని దేవనహళ్లిలో ఫాక్స్కాన్ ప్లాంట్ నెలకొల్పింది. ఐఫోన్ 17ను యాపిల్ సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.