News August 17, 2025

తల్లాడ: ‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి’

image

వంగవీటి మోహనరంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్ అన్నారు. తల్లాడ మండలంని రామచంద్రాపురంలో ఆయన వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. వంగవీటి పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News August 18, 2025

ఖమ్మం: పంట.. వర్షం తంటా!

image

ఎడతెరిపి లేని వర్షాలతో రైతు అవస్థలు పాలవుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసి చేతికందే దశలో పంటలు వర్షాలకు నీటిపాలవుతున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా కొంత మేరకు పత్తి, వరి పంటలు జలమయం కాగా ప్రతి రోజు విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి పంటలు నేలవారటం తోపాటు కుళ్ళిపోతున్నాయి. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ గ్రామాల్లో ఆ పరిస్థితి ఉందా..?

News August 18, 2025

ఖమ్మం: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నేటి నుంచి శిక్షణ

image

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తవగా, రెండో విడత శిక్షణ ఉమ్మడి ఖమ్మం సహా 23 జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

News August 17, 2025

శంకరగిరి తండాలో అంబరాన్ని అంటిన తీజ్ సంబరాలు

image

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ఆదివారం తీజ్ సంబరాలు ఘనంగా జరిగాయి. బంజారా, లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఈ వేడుకను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలు ముగింపు సందర్భంగా యువతులు నృత్యాలతో సందడి చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు.