News August 18, 2025

కొత్తపేట: ఆస్పత్రిలో కుమారుడు.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

image

కొత్తపేట మండలం పూజారి పాలానికి చెందిన పొనుగుపాటి రమేష్ (31) బైక్‌పై వస్తుండగా ఆదివారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు. కరప మండలం వలసపాకల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. మృతుని తమ్ముడు నటరాజు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రమేష్ చిన్న కొడుకు వివేక్ వర్దన్‌కు కాకినాడ GGHలో సర్జరీ చేయించారు. ఆస్పత్రి నుంచి రమేష్ ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News August 18, 2025

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో డీజే, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు అసౌకర్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగం పూర్తిగా నిషిద్ధమని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News August 18, 2025

కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

image

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.

News August 18, 2025

MNCL: రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి

image

రైలులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ధన్పత్ లాల్ యాదవ్ తమిళనాడులో పనిచేసేందుకు గ్రామస్తులతో కలిసి రైలులో వెళుతుండగా అస్వస్థతకు గురయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతదేహాన్ని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దింపగా.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.