News August 18, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి: CBN
* దేశానికి జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేశ్
* ఎన్టీఆర్పై తీవ్ర వ్యాఖ్యలంటూ ప్రచారం.. టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
* TG: ఏపీలోనూ కాంగ్రెస్ బలపడుతుంది: భట్టి
* కాళేశ్వరం మోటార్లను నాశనం చేసేందుకు కుట్ర: హరీశ్
* ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P.రాధాకృష్ణన్
* ‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ
Similar News
News August 18, 2025
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. ఐదుగురు దుర్మరణం

TG: హైదరాబాద్లో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామాంతపూర్లోని గోకుల్ నగర్లో శ్రీ కృష్ణ శోభా యాత్ర నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతులను శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్రరెడ్డిలుగా గుర్తించారు.
News August 18, 2025
EP-40: వీరితో శత్రుత్వం వద్దు: చాణక్య నీతి

కొంతమందితో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదని, అది ఖరీదైనదిగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. ‘మీ పొరుగువారితో సంబంధాలు చెడితే శత్రువులుగా మారుతారు. అత్యంత సన్నిహితులతోనూ శత్రుత్వం వద్దు. మీ రహస్యాలు, బలహీనతలు బయటపడి ముప్పుగా మారవచ్చు. కుటుంబసభ్యులనూ శత్రువులుగా చేసుకోవద్దు. ప్రభావవంతమైన వ్యక్తులతోనూ శత్రుత్వం వద్దు. ఆఫీసులో సహోద్యోగులతో శత్రుత్వం పెంచుకోకూడదు’ అని చెబుతోంది. #<<-se>>#Chanakyaneeti<<>>
News August 18, 2025
మాధవ్ కౌశిక్ ఊచకోత.. 31 బంతుల్లోనే 95*

యూపీ టీ20 లీగ్లో మీరట్ మావరిక్స్ బ్యాటర్ మాధవ్ కౌశిక్ అరాచకం సృష్టించారు. కాన్పూర్ సూపర్స్టార్స్తో జరిగిన మ్యాచులో మాధవ్ 31 బంతుల్లోనే 95* పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మాధవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 300పైన ఉండటం విశేషం. అతడి దూకుడుతో మీరట్ ఓవర్లన్నీ ఆడి 225/2 పరుగులు చేసింది. ఛేదనలో కాన్పూర్ 20 ఓవర్లలో 139/9 పరుగులకే పరిమితమైంది.