News August 18, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నాగరాణి

వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా ఏపీకి మరో 3 రోజులు భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించిందన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు.
Similar News
News August 19, 2025
నరసాపురం: సైలింగ్ బోటింగ్కు వంద మంది క్యాడెట్లు

వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి 10వ వరకు ఒరిస్సాలోని చిలుక నేవల్ బేస్లో నరసాపురం ఆంధ్రా యూనిట్ ఆధ్వర్యంలో సైలింగ్ బోటింగ్ సాహస యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది క్యాడెట్లు పాల్గొనన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను యూనిట్ కమాండర్ సంజిత్ రౌత్రే, డిప్యూటీ క్యాంపు కమాండర్ అనిల్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
News August 19, 2025
భీమవరం: కల్లు గీత కార్మికులకు బార్ల ఎంపిక

జిల్లాలోని కల్లుగీత కార్మికులకు కొత్తగా మంజూరైన 3 బార్లకు కులాల వారి రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో కల్లు గీత కార్మికులకు కేటాయించిన బార్ల ఎంపిక రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ తీసి ఎంపిక చేశారు. శెట్టి బలిజలకు -2, గౌడ – 1ను భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో కేటాయించడం జరిగిందన్నారు.
News August 18, 2025
దుంపగడప: వీవీ గిరి కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన

ఆకివీడుమండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, కలెక్టర్ నాగరాణీలు శంకుస్థాపన చేసారు. భారత జీవిత భీమా సంస్థ సామాజిక బాధ్యత విభాగం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వీవీ.గిరి ప్రభుత్వ కళాశాలకు ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణానికి రూ. 1.06 కోట్లు నిధులు ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.