News August 18, 2025

కృష్ణమ్మ ఉధృతి.. అప్రమత్తంగా ఉండాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితులను సమీక్షించారు. వరద ప్రభావిత గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News August 19, 2025

విజయవాడ: సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్‌లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

News August 19, 2025

H.జంక్షన్ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

హనుమాన్ జంక్షన్ పోలీసులను ఒక ప్రేమ జంట ఆశ్రయించింది. తాము గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, సోమవారం విజయవాడలోని గుణదల చర్చిలో కులాంతర వివాహం చేసుకున్నామని షేక్ హసీనా (21), ఏడుకొండలు (23) తెలిపారు. వీరిద్దరూ మడిచర్లకి చెందినవారు. తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

News August 19, 2025

మచిలీపట్నం: ‘బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం’

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీ ఆర్. గంగాధరరావు ఐపీఎస్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరంగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విని, అవసరమైతే కేసులు నమోదు చేసి సహాయం అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.