News August 18, 2025

శుభ్‌మన్ గిల్‌కు BCCI బిగ్ షాక్?

image

ఆసియా కప్ 2025 కోసం BCCI ప్రకటించే భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు కల్పించడం లేదని తెలుస్తోంది. టీ20 ప్రణాళికల్లో ఆయన లేకపోవడమే ఇందుకు కారణమని టాక్. అతడికి బదులు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. టీమ్ ఇండియా ప్లేయర్లలో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉండటం కూడా గిల్‌ను పక్కన పెట్టేందుకు మరో కారణమని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Similar News

News August 19, 2025

16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

News August 19, 2025

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. నేడు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం.. తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లీ మండలాలకూ సెలవు ప్రకటించారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

News August 19, 2025

బెంగళూరులో ‘యాపిల్’ అద్దె రూ.1,000 కోట్లు!

image

ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ బెంగళూరులో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ స్టాక్ తెలిపింది. ఇందుకు రూ.31.57 కోట్లు డిపాజిట్ చేసి, నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఏడాదికి 4.5 శాతం అద్దె పెంపుతో పదేళ్లకు రూ.1,000 కోట్ల రెంట్ చెల్లించనున్నట్లు పేర్కొంది. 13 అంతస్తుల భవనంలో 9 అంతస్తులను 2035 వరకు లీజుకు తీసుకుంది.