News August 18, 2025
భార్యాభర్తల గొడవ.. నీల్వాయి SI సస్పెండ్

వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ SI సురేశ్ సస్పెండ్ అయ్యారు. CP అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు విడుదల చేశారు. సంపుటం గ్రామానికి చెందిన భార్యాభర్తల గొడవ విషయంలో కౌన్సెలింగ్ పేరిట స్టేషన్కు పిలిపించారు. తనను SI చితకబాదారని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు SI సురేశ్పై సస్పెన్షన్ వేటు వేశారు. గత నెల 19న వీధుల్లో చేరి నెల రోజులు గడవకముందే సస్పెండ్ అయ్యారు.
Similar News
News August 18, 2025
‘మార్వాడీ గో బ్యాక్’: ఆమనగల్లు బంద్పై ఉత్కంఠ

ఆమనగల్లు బంద్ చర్చనీయాంశమైంది. మార్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు ‘గో బ్యాక్’ నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అనగా, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్థానిక వ్యాపారుల మద్దతుదారులు తేల్చి చెప్పగా.. బంద్ ఉత్కంఠ రేపుతోంది.
News August 18, 2025
‘మార్వాడీ గో బ్యాక్’: ఆమనగల్లు బంద్పై ఉత్కంఠ

ఆమనగల్లు బంద్ చర్చనీయాంశమైంది. మార్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు ‘గో బ్యాక్’ నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అనగా, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్థానిక వ్యాపారుల మద్దతుదారులు తేల్చి చెప్పగా.. బంద్ ఉత్కంఠ రేపుతోంది.
News August 18, 2025
ప్రకాశం: గిరిజన బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా?

ఈనెల 14న దోర్నాల (M)చిన్నారుట్ల గూడెంలో చిన్నారి అంజమ్మపై చిరుతపులి దాడి చేసిన ఘటన తెలిసిందే. నల్లమల అరణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన ఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. చిరుత కదలికలపై దృష్టి సారించేందుకు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేయగా తాజాగా ఓ కెమెరాకు గూడెం పరిసరాల్లో తరచుగా సంచరిస్తున్న చిరుతపులి చిక్కింది. ఇది చిన్నారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.