News August 18, 2025
కోహ్లీ దెబ్బకు రికార్డులన్నీ ‘సలామ్’ అనాల్సిందే!

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 17 ఏళ్లు. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన ODIలో విరాట్ డెబ్యూ చేశారు. ఆ తర్వాత ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా ఎదిగారు. కెప్టెన్గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. దిగ్గజ ప్లేయర్లు నెలకొల్పిన ఎన్నో రికార్డులు కింగ్ ధాటికి సలామ్ అన్నాయి. T20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు.
Similar News
News August 18, 2025
GOOD IDEA: నాయకులారా.. మీరూ ఇలా చేయండి!

TG: ప్రజా ప్రతినిధులను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలను తీసుకొస్తుంటారు. వీటికి బదులు పుస్తకాలు, రగ్గులు తీసుకొస్తే పేదలకు పంచేందుకు ఉపయోగపడుతాయని కొందరు పిలుపునిచ్చారు. అయితే కాస్త కొత్తగా ఆలోచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. శాలువాలను పిల్లల డ్రెస్సులుగా మార్చారు. ‘Honour to Humanity’ పేరిట పేద పిల్లలకు వీటిని అందించనున్నారు. దీనిని అంతా ఫాలో అవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
News August 18, 2025
కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.
News August 18, 2025
యూరియా కోసం కాంగ్రెస్ MPల నిరసన

TG: రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు భవనం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రమంత్రి నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని వారు కోరనున్నారు. యూరియాపై జీరో అవర్లో ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు.