News August 18, 2025

RED ALERT: నేడు అత్యంత భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Similar News

News August 19, 2025

16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

image

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

News August 19, 2025

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. నేడు ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం.. తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లీ మండలాలకూ సెలవు ప్రకటించారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

News August 19, 2025

బెంగళూరులో ‘యాపిల్’ అద్దె రూ.1,000 కోట్లు!

image

ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ బెంగళూరులో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ స్టాక్ తెలిపింది. ఇందుకు రూ.31.57 కోట్లు డిపాజిట్ చేసి, నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఏడాదికి 4.5 శాతం అద్దె పెంపుతో పదేళ్లకు రూ.1,000 కోట్ల రెంట్ చెల్లించనున్నట్లు పేర్కొంది. 13 అంతస్తుల భవనంలో 9 అంతస్తులను 2035 వరకు లీజుకు తీసుకుంది.