News August 18, 2025
సాలూరు: తల్లి మరణం తట్టుకోలేక తనయుడి సూసైడ్

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాలూరుకు చెందిన తట్టికోట సరస్వతి(80) ఈనెల 8న మరణించారు. ఆమె లేదని మనస్తాపం చెందిన కుమారుడు రామక్రిష్ణ (50) సోమవారం నుంచి కనిపించకపోగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరఘట్టం వద్ద నాగావళి నదిలో శవమై కనిపించాడు. తనకు అండగా ఉండే అమ్మ చనిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News August 19, 2025
నిర్మల్ జిల్లాలో 428.2 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24గంటల్లో 428.2మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుబీర్14.2, తానూర్13.8, బాసర8.4, ముధోల్ 15.2, భైంసా 18.4, కుంటాల 30.8, నర్సాపూర్ 18.2, లోకేశ్వరం 18.4, దిలావర్పూర్ 25.4, సారంగాపూర్ 37.2, నిర్మల్ 32.6, నిర్మల్ రూరల్ 26.4, సోన్ 24.4, లక్ష్మణచందా 17.2, మమడ 25.2, పెంబి 27.6, ఖానాపూర్ 22.2, కడెం 21.2, దస్తురాబాద్ 31.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
News August 19, 2025
రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.
News August 19, 2025
కరీంనగర్: WOW.. నీటిపై మబ్బులు.. PHOTO!

కరీంనగర్లోని లోయర్ మానేరు జలాశయం వద్ద ఓ అపూర్వమైన ప్రకృతి దృశ్యం ఆకట్టుకుంటోంది. మబ్బులు నీటిపైకి వచ్చినట్లు కనిపించే ఈ దృశ్యం చూసిన ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. నీలి ఆకాశం, నిశ్శబ్దంగా ప్రవహించే జలాలతో కలిసి, ఆకాశంలోని మబ్బులు నీటిపై తేలుతున్నట్లు ఓ కలల ప్రపంచాన్ని తలపిస్తోంది. ఈ అరుదైన చిత్రాన్ని Way2News క్లిక్ మనిపించింది. #నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.