News August 18, 2025
కర్నూలు జిల్లాలో స్కూళ్లకు సెలవులు ఇవ్వరా..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందవరం, దేవనకొండ, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు, బనగానపల్లె, ప్యాపిలి సహా ఇతర మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు కూడా సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నాయి. మరి సెలవులు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.
Similar News
News August 19, 2025
నిర్మల్ జిల్లాలో 428.2 మి.మీ వర్షపాతం

నిర్మల్ జిల్లాలో గడిచిన 24గంటల్లో 428.2మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుబీర్14.2, తానూర్13.8, బాసర8.4, ముధోల్ 15.2, భైంసా 18.4, కుంటాల 30.8, నర్సాపూర్ 18.2, లోకేశ్వరం 18.4, దిలావర్పూర్ 25.4, సారంగాపూర్ 37.2, నిర్మల్ 32.6, నిర్మల్ రూరల్ 26.4, సోన్ 24.4, లక్ష్మణచందా 17.2, మమడ 25.2, పెంబి 27.6, ఖానాపూర్ 22.2, కడెం 21.2, దస్తురాబాద్ 31.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.
News August 19, 2025
రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.
News August 19, 2025
కరీంనగర్: WOW.. నీటిపై మబ్బులు.. PHOTO!

కరీంనగర్లోని లోయర్ మానేరు జలాశయం వద్ద ఓ అపూర్వమైన ప్రకృతి దృశ్యం ఆకట్టుకుంటోంది. మబ్బులు నీటిపైకి వచ్చినట్లు కనిపించే ఈ దృశ్యం చూసిన ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. నీలి ఆకాశం, నిశ్శబ్దంగా ప్రవహించే జలాలతో కలిసి, ఆకాశంలోని మబ్బులు నీటిపై తేలుతున్నట్లు ఓ కలల ప్రపంచాన్ని తలపిస్తోంది. ఈ అరుదైన చిత్రాన్ని Way2News క్లిక్ మనిపించింది. #నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.