News August 18, 2025

NZB: రుణమాఫీ, రైతు భరోసా, రైతుభీమా నిధులు ఎన్నంటే?

image

నిజామాబాద్ జిల్లాలో రైతు సంక్షేమ పథకాలు ఊపందుకున్నాయి. రైతు రుణమాఫీ కింద 97,696 మంది రైతుల పంట రుణాలు రూ.755.29 కోట్లు మాఫీ అయ్యాయి. ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద 2,72,589 మంది రైతుల ఖాతాల్లో రూ.316 కోట్లు జమ చేశారు. రైతు బీమా ద్వారా 966 మంది రైతుల కుటుంబాలకు రూ.48.30 కోట్లు అందాయి. ఇలా మొత్తం మీద రైతులకు రూ.1,119 కోట్లకు పైగా ప్రయోజనం లభించింది.

Similar News

News August 18, 2025

NZB: ప్రజావాణికి 52 ఫిర్యాదులు

image

నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ, ఏసీపీ పాల్గొన్నారు.

News August 18, 2025

సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని NZBకలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

News August 18, 2025

నిజామాబాద్ జిల్లాలో 17,301 ఇందిరమ్మ ఇళ్లు

image

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా కొనసాగుతోంది. 19,397 ఇళ్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 17,301 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 9,486 ఇళ్లకు మార్కింగ్, 4,820 ఇళ్లకు బేస్‌మెంట్ పనులు పూర్తయ్యాయి. 742 ఇళ్లు రూఫ్ లెవల్, 237 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు వచ్చాయి. ఈ పనులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 60.36 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.