News August 18, 2025

సలాడ్స్‌ తింటే ఎన్ని లాభాలో..

image

సలాడ్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ & నీరు ఉండటంతో కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఆకుకూరలు, టమాటాలు, అవకాడోలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Similar News

News August 18, 2025

భారత్, పాక్ మ్యాచ్.. 10 సెకండ్లకు రూ.16లక్షలు

image

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవనున్న ఆసియా కప్‌లో భారత్, పాక్ తలపడే మ్యాచ్‌లకు యాడ్స్ పరంగా భారీ డిమాండ్ నెలకొంది. ఈ టోర్నీని బ్రాడ్‌కాస్ట్ చేయనున్న సోనీ TVలో 10సెకండ్ల యాడ్ స్లాట్‌కు రూ.16 లక్షల ధర నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. వచ్చే నెల 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. తర్వాత సూపర్-4 స్టేజ్‌లోనూ ఎదురుపడే అవకాశముంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే 28న టైటిల్ కోసం తలపడుతాయి.

News August 18, 2025

చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ

image

నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై మెగాస్టార్ చిరంజీవి దృష్టి సారించారు. నిన్న నిర్మాతలతో భేటీ అయిన ఆయన తన వంతుగా కార్మికులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చిరు ఇంటికి వెళ్లారు. వారి డిమాండ్లపై ఆయన చర్చిస్తున్నారు. అదే సమయంలో ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రొడ్యూసర్లు సమావేశం అయ్యారు. కార్మికుల సమ్మె విరమణ ఇవాళ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

News August 18, 2025

కేంద్రమంత్రులతో నారా లోకేశ్ భేటీ

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. కానూరు-మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని గడ్కరీని కోరారు. అటు రాష్ట్రంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని నిర్మలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టీడీపీ పార్లమెంట్ కార్యాలయానికి వెళ్లిన లోకేశ్‌ను TDP, JSP ఎంపీలు ఘనంగా సత్కరించారు.