News August 18, 2025

కృత్రిమ కొరత సూచిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సోమవారం సమీక్ష సమావేశాన్ని జరిపారు. రైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రైతులకు కావాల్సిన డీఏపీ అందుబాటులో ఉందన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సూచిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే షాపు లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామన్నారు.

Similar News

News August 18, 2025

కృష్ణా జిల్లాలో 43 కొత్త బార్‌లు

image

కృష్ణా జిల్లాలో త్వరలోనే 43 బారులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు గెజిట్ నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నారని ఎక్సైజ్ అధికారి గంగాధర్ రావు తెలిపారు. ఈ బార్‌లలో నలుగురిని గీత కార్మికుల కోటా కింద కేటాయించగా, మిగతా బారులు ఓపెన్ క్యాటగిరీలో ఉంటాయి. ఓపెన్ క్యాటగిరీలో బార్‌ల కోసం దరఖాస్తుల సమర్పణకు ఈనెల 26వ తేదీ చివరి రోజు కాగా, గీత కార్మికుల కోటా దరఖాస్తులకు 29వ తేదీ వరకు గడువు ఉంది.

News August 18, 2025

స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలి: BSP

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఇటుక, స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలని BSP జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుమలాయపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందించారు. నిరుపేదలు అప్పుల బారిన పడకుండా రూ.5 లక్షల లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 18, 2025

SKLM: ఎస్సీ గ్రీవెన్స్‌కు 43 వినతులు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు 43 వినతులు ఎస్పీకి సమర్పించారు. నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి, అర్జీదారులు సంతృప్తి పొందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. జూమ్ ద్వారా ఆయా పోలీస్ అధికారులతో మాట్లాడారు. న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలన్నారు.