News August 18, 2025
VKB: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం: కలెక్టర్

ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి 45 ఫిర్యాదు వచ్చాయన్నారు. రైతుల భూ సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలన్నారు.
Similar News
News August 18, 2025
రాష్ట్రస్థాయి విజేతలుగా HYD, NZB

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, RR జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.
News August 18, 2025
రాష్ట్రస్థాయి విజేతలుగా HYD, NZB

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, రంగారెడ్డి జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.
News August 18, 2025
నేషనల్ అవార్డ్స్ విజేతలకు సీఎం సన్మానం

TG: భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా HYDను నిలపాలని CM రేవంత్ అన్నారు. సినిమా రంగానికి అవసరమైన చేయూతనందిస్తామని తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన సినీ ప్రముఖులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను CM దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దర్శకులు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్ తదితరులను CM సన్మానించారు.