News August 18, 2025
సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: హేమంతరావు

సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు కోరారు. సోమవారం వైరా మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఈ మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
Similar News
News August 18, 2025
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: తుమ్మల

వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం HYD నుంచి యూరియా, ఎరువుల లభ్యతపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఈ సందేశం ఫీల్డ్ లెవల్ లో వెళ్లాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News August 18, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయండి : Dy CM భట్టి

మధిర పట్టణ సమగ్ర అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ఒకసారి మున్సిపల్ ఇంజినీర్ ఇన్చీఫ్, 15 రోజులకు చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు
News August 18, 2025
KMM: రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా పోలీస్ చర్యలు

ఇటీవల రాత్రివేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా ఖమ్మం పోలీస్ శాఖ మరింత పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో సోమవారం పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి డ్రంకన్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు.