News August 18, 2025

NZB: దొంగ ఎవరో మీరే తేల్చండి?

image

డిచ్‌పల్లి CMC మెడికల్ కాలేజ్ వ్యవహారంపై ఛైర్మెన్ షణ్ముఖ మహా లింగం సోమవారం NZB ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. CMCలో 4 నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలు, నియామకాలు తదితర వివరాలను వివరించారు. IMA NZB అధ్యక్షుడిగా పరిచయమైన డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పని చేస్తున్న డాక్టర్ సుమంత్ చర్యలపై ఆరోపణలు గుప్పించారు. దొంగ ఎవరో మీరే తేల్చండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Similar News

News August 18, 2025

SRSP UPDATE: 1 వరద గేట్ మూసివేత

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో సోమవారం 39 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాత్రి ఇన్ ఫ్లో కొంచెం తగ్గడంతో ఒక వరద గేటును మూసి 38 గేట్ల ద్వారా 1,32,390 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందిరమ్మ కాల్వకు 18 వేలు, కాకతీయ కాల్వకు 4,700 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1,17,148 క్యూసెక్కుల నీరు వస్తోందని SRSP అధికారులు చెప్పారు.

News August 18, 2025

NZB: రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.

News August 18, 2025

NZB: యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి

image

వ్యవసాయ అవసరాల కోసం కేటాయిస్తున్న యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు. సోమవారం వారు రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.