News August 19, 2025
15 రోజులకు 2 సార్లు చల్లితే మంచి ఫలితాలు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని రైతులు ప్రస్తుత అవసరానికి మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ప్రస్తుతం 2,700 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, రైతులు ప్రస్తుత అవసరానికి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఎకరానికి ఒకేసారి కాకుండా 15 రోజులకు 2 సార్లు చల్లితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
Similar News
News August 24, 2025
మట్టి గణపతిని పూజిద్దాం: కలెక్టర్ అనుదీప్

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. శనివారం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మట్టి, పిండితో వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించే పద్ధతులను మానుకొని, మట్టి గణపతులకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు.
News August 23, 2025
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా హేమంతరావు

CPI రాష్ట్ర సమితి కార్యదర్శివర్గ సభ్యుడిగా జిల్లాకు చెందిన బాగం హేమంతరావు ఎన్నికయ్యారు. మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా గాజులరామవరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. నేలకొండపల్లి మండలం మోటాపురంలో రైతు కుటుంబంలో జన్మించిన బాగం హేమంతరావు విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
News August 23, 2025
KMM: ఆకట్టుకున్న ఎకో ఫ్రెండ్లీ గణనాథుల తయారీ

ఖమ్మం నగరంలో శనివారం చిన్నారులు తమ చిట్టి చేతులతో ఎకో ఫ్రెండ్లీ గణనాధులను తయారు చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ గణపయ్యనే పూజించాలని తెలియజేస్తూ చిన్నారులు ఉత్సాహంగా ఎకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేశారు. వివిధ రూపాలలో వినాయక ప్రతిమలను అందంగా రూపొందించారు. మట్టి గణపయ్యను శోభాయమానంగా తీర్చిదిద్దారు.