News August 19, 2025
ప్రజలను అప్రమత్తం చేయాలి: ఎస్పీ

వర్షాల వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదుల వద్ద పోలీస్ అధికారులు బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News August 24, 2025
DSCలో 3 ఉద్యోగాలు సాధించిన రేవతి

ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లెకు చెందిన వీరప్ప-లింగమ్మ కుమార్తె రేవతి డీఎస్సీలో 3 ఉద్యోగాలు సాధించింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రేవతి 9వ ర్యాంక్తో స్కూల్ అసిస్టెంట్, 6వ ర్యాంక్తో PGT, TGT పోస్టులకు అర్హత సాధించింది. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని రేవతి అన్నారు.
News August 24, 2025
ఇక జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్స!

TG: క్యాన్సర్ మహమ్మారి చికిత్స కోసం HYDకు రాకుండా జిల్లాల్లోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోధనాస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తక్షణమే 34 మెడికల్ కాలేజీల్లో 20 పడకల(10 కీమో, 10 పాలియేటివ్ కేర్) చొప్పున కేటాయించనుంది. ఇప్పటికే 27 సెంటర్లకు కేంద్రం రూ.40.23 కోట్లు నిధులు ఇవ్వగా మరో ఏడింటిని రాష్ట్ర నిధులతో సమకూర్చనున్నారు.
News August 24, 2025
మధ్యాహ్నం నిద్రపోతున్నారా: చాణక్య నీతి

మధ్యాహ్నం నిద్ర మేలు కాదని చాణక్య నీతి చెబుతోంది. దీంతో ఇతరుల కంటే పని తక్కువగా చేయడమే కాకుండా సమయం వృథా అవుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు మాత్రమే నిద్ర పోవాలని అంటోంది. మధ్యాహ్నం నిద్రతో జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. పవర్ న్యాప్(10-15 నిమిషాల నిద్ర)కు ఇది మినహాయింపు.
<<-se>>#chanakyaneeti<<>>