News April 1, 2024
కాశినాయన: మహిళ అదృశ్యంపై ఫిర్యాదు నమోదు

కాశినాయన మండలం బాలయ్య పల్లెకు చెందిన బసిరెడ్డి స్వర్ణలత 16 రోజుల నుంచి కనిపించ లేదని కుటుంబీకులు తెలిపారు. వారు వెతికినా ఆచూకీ లభించలేదని కాశి నాయన మండలం ఎస్సై అమర్నాథ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9121100660 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.
Similar News
News March 16, 2026
కడప జిల్లాలో 16 మంది ఎమ్మార్వోలు బదిలీ

ప్రొద్దుటూరు ఎమ్మార్వో గంగయ్య కడప కలెక్టరేట్ ఏవోగా బదిలీ అయ్యారు. ప్రొద్దుటూరుకు కడప కలెక్టరేట్ AO విజయకుమార్ రానున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని 16 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బద్వేల్, బి.కోడూరు, చెన్నూరు, పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లె, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, రాజంపేట, కాశినాయన, నందలూరు, సుండుపల్లె ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News March 16, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,670
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,416
* వెండి 10 గ్రాముల ధర రూ.2585.
News March 16, 2026
కడప: ఓపెన్ 10th పరీక్షలకు 388 విద్యార్థులు డుమ్మా.!

కడప జిల్లాలో సోమవారం 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలను నిర్వహించారు. నేటి పరీక్షలకు 389 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 2261 మంది విద్యార్థులు తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. 1875 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు 63 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 61 మంది పరీక్షలు రాశారు. జిల్లాలో రెగ్యులర్ 10th పరీక్షలు 167 సెంటర్లలో జరిగాయి. 27,838(100%) మంది విద్యార్థులు హాజరయ్యారు.


