News August 19, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా కాగజ్ మద్దూర్ 62.8 మిమీలు, దామరంచ 59.3, మిన్పూర్, నర్సాపూర్ 53.3, మాసాయిపేట్ 50, వెల్దుర్తి 46, శివంపేట్ 43.5, నార్లాపూర్ 43.3, కొల్చారం 41, చిప్పలతుర్తి 40.8, రామాయంపేట 37.8, ఇస్లాంపూర్ 34.5, చేగుంట 31.3 మిమీల వర్షం కురిసింది.
Similar News
News September 4, 2025
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

నర్సాపూర్లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.
News September 4, 2025
మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక: డీఈవో

మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు డీఈవో ప్రొ. రాధాకిషన్ తెలిపారు. ఈనెల 6న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ ఉపాధ్యాయులున్నారని డీఈవో వివరించారు.
News September 4, 2025
మెదక్: సీఎం వస్తారనుకున్నారు… కానీ రావట్లేదు..!

భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదం కనులారా వీక్షించి కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు సీఎం వస్తాడని ఆశించిన అన్నదాతలు ఆవిరయ్యాయి. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పోచారం ప్రాజెక్ట్ సందర్శిస్తారని ప్రచారం జరిగింది. పర్యటన షెడ్యూల్ లో లేకపోవడంతో నిరాశ చెందారు. వందలాది ఎకరాల పంట, రోడ్డు, ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తీరని నష్టం మిగిలింది. సీఎం వస్తే కొంత ఉపశమనం కలిగేదని ఆశించారు.