News August 19, 2025
విశాఖ-అరకు వస్తున్న ఎక్సప్రెస్కు స్త్రీ శక్తి పథకం అమలు కావట్లేదు

విశాఖ నుంచి అరకు మీదుగా ఒనకఢిల్లీ వెళ్ళే ఎక్సప్రెస్ కు “అంతరాష్ట్ర సర్వీసు” పేరుతో స్త్రీ శక్తి పథకం అమలు చేయలేదు. విశాఖ నుంచి అరకు వస్తున్న ఒకే ఒక్క ఎక్సప్రెస్ కావడంతో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ మండలాల మహిళలకు స్త్రీ శక్తి పథకం అందని ద్రాక్షగా ఉంది. ఈ బస్సు ప్రయాణించు 200కి.మీలలో 130కి.మీ ఆంధ్రలోనే ఉంది. దీనిపై DPTO మహేశ్వరరెడ్డిని వివరణ కోరగా పైస్థాయిలో అంతరాష్ట్ర సర్వీసలపై చర్చ జరుగుతుందన్నారు
Similar News
News August 19, 2025
ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

HYD రామంతాపూర్లో విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.
News August 19, 2025
రాజమండ్రి: నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠా అరెస్ట్

నకిలీ దస్తావేజులు సృష్టించి ఆస్తులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య తెలిపారు. రాజమండ్రికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు చేపట్టిన విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కవలగొయ్యిలోని విశాలాక్షి ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మివేసిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
News August 19, 2025
ఏలూరు: రైలు ఢీకొని మహిళ మృతి

పొట్టిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ మహిళ మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఏలూరు రైల్వే స్టేషన్ పరిధి పొట్టిపాడులో రైల్వే ట్రాక్ దాటుతున్న చిక్కవరపు లక్ష్మి (30)ని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.