News August 19, 2025

విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరం: డా.రత్తయ్య

image

విద్యార్థులకు నిరంతర అభ్యాసం అవసరమని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరగలరని విజ్ఞాన్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా.లావు రత్తయ్య తెలిపారు. విద్యార్థుల్లో చదువు, అభివృద్ధి అనేది సంతోషంగా జరగాల్సిన ప్రక్రియని చెప్పారు. సోమవారం బీటెక్ 1st ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులందికీ అభినందనలు తెలిపారు.

Similar News

News August 19, 2025

చర్లపల్లి: నాయుడుపేట వెళ్లే ప్రజలకు గుడ్‌న్యూస్

image

సిటీ నుంచి నాయుడుపేట వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్‌గా చర్లపల్లి నుంచి చెన్నయ్ వెళ్లే రైలు నాయుడుపేట మీదుగా వెళ్తుంది. అయితే అక్కడ స్టాపేజ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల కోరిక మేరకు నాయుడుపేటలో స్టాప్ ఏర్పాటు చేశారు. దీంతో చర్లపల్లి- చెన్నై ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12604) ఇక నుంచి 2 నిమిషాల పాటు నాయుడుపేటలో ఆగుతుంది.

News August 19, 2025

HYD: జాగ్రత్త.. వీడియో కాల్ న్యూడ్ కాల్‌గా మారుస్తున్నారు

image

సైబర్ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. డేటింగ్ యాప్‌లో పరిచయం చేసుకొని వీడియో కాల్స్ మాట్లాడించి ఆ తర్వాత దానిని మార్ఫింగ్ చేసి నగ్న వీడియోగా మార్చి బెదిరిస్తున్నారు. గుడిమల్కాపూర్‌కు చెందిన యువకుడి నుంచి రూ.1.80 లక్షలు వసూలు చేశారు. తిరిగి లక్షల్లో డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వారితో అసలు వీడియో కాల్‌లో మాట్లాడవద్దని సైబర్ పోలీసులు చెబుతున్నారు.

News August 19, 2025

గతంలో 3 నెలలు ఊచలు లెక్కించిన ‘సృష్టి’ నమ్రత

image

అక్రమ సరోగసి కేసులో అరెస్ట్ అయిన డా.నమ్రత గతంలో 3 నెలలు జైలులో ఉండి వచ్చారు. 2020లో ఏపీలోని మాడుగులకు చెందిన ఓ మహిళ నమ్రతపై ఫిర్యాదు చేయడంతో జైలుకు వెళ్లింది. తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. జైలు నుంచి తిరిగి వచ్చినా నమ్రత దందా కొనసాగించి ఇటీవల మళ్లీ అరెస్ట్ అయింది.