News August 19, 2025

HYD: నిమజ్జనోత్సవానికి ఖర్చు రూ.30 కోట్లు

image

నిమజ్జనోత్సవం.. HYDలో ఈ వేడుక ఉంటే సందడేవేరు. ఇందుకు GHMC దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే సెప్టెంబరు 6న జరిగే శోభాయాత్ర, నిమజ్జనాలకు బల్దియా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగలకు సమస్యలు రాకుండా చర్యలు, అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకచ చవితి (27న) మూడో రోజు నుంచే (29న) HYDలో నిమజ్జనాలు ప్రారంభమవుతాయి.

Similar News

News August 19, 2025

రామంతాపూర్ ఘటనపై HRC సీరియస్.. సుమోటోగా కేసు

image

HYD రామంతాపూర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్రలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడడం విషాదకరమని HRC వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై HRC సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం, భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని TGSPDCL సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.

News August 19, 2025

RR: ఆకులమైలారం బిడ్డ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా..!

image

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి <<17452574>>ఎంపికైన విషయం<<>> తెలిసిందే. రంగారెడ్డి(D) కందుకూరు(M) ఆకులమైలారంలో 1946 జులై 8న ఓ సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. 1971లో HYDలోని ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. ప్లీడర్‌గా పని చేసిన ఆయన 1990లో ఓయూ లీగల్ అడ్వైజర్‌గా ఉన్నారు. తమ గ్రామస్థుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంపై ఆకులమైలారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News August 19, 2025

చర్లపల్లి: నాయుడుపేట వెళ్లే ప్రజలకు గుడ్‌న్యూస్

image

సిటీ నుంచి నాయుడుపేట వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెగ్యులర్‌గా చర్లపల్లి నుంచి చెన్నయ్ వెళ్లే రైలు నాయుడుపేట మీదుగా వెళ్తుంది. అయితే అక్కడ స్టాపేజ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల కోరిక మేరకు నాయుడుపేటలో స్టాప్ ఏర్పాటు చేశారు. దీంతో చర్లపల్లి- చెన్నై ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12604) ఇక నుంచి 2 నిమిషాల పాటు నాయుడుపేటలో ఆగుతుంది.