News August 19, 2025

యూరియా కేటాయింపులో తెలంగాణకు అన్యాయం: ఎంపీ

image

యూరియా కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. యూరియా సమస్యపై మంగళవారం పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీతో కలిసి ఖమ్మం ఎంపీ ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెలంగాణకు రావాల్సిన మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News August 19, 2025

vkb: జిల్లాలో వర్షపాతం వివరాలు

image

వికారాబాద్ జిల్లాలో సోమవారం 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లి 21.5, మోమిన్‌పేట్ 32.7, నవాబుపేట్ 25, వికారాబాద్ 26.2, పూడూర్ 24.1, పరిగి 19.9, కుల్కచర్ల 17.3, దోమ 15, బొంరాస్పేట్ 11.6, దారుర్ 18.2, కోట్‌పల్లి 3.8, బంట్వారం 16.6, పెద్దేముల్ 20.2, తాండూర్ 18, బషీరాబాద్ 11.4, యాలాల్ 12.6, కొడంగల్ 7.9, దౌల్తాబాద్ 5.1, దుద్యాల్ 6.8 మిల్లీమీటర్లు నమోదైంది.

News August 19, 2025

16 సర్కిళ్ల SE, DE ఆపరేషన్, DE టెక్నికల్స్‌తో CMD వీడియో కాన్ఫరెన్స్

image

హనుమకొండలోని TGNPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల SE, DE ఆపరేషన్, DE టెక్నికల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది నుంచి పోల్స్‌పై ఉన్న కేబుల్ వైర్లు తొలగించమని కేబుల్ ఆపరేటర్లకు విన్నవించినా పట్టించుకోవట్లేదని, విద్యుత్ ప్రమాదాల జరుగుతున్నాయన్నారు. అందుకు అనుగుణంగా కేబుల్ వైర్లు రీ-అలైన్‌మెంట్ చేసుకోవాలని లేదంటే తొలగించాలని ఎస్ఈలను ఆదేశించారు.

News August 19, 2025

JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలు

image

అనంతపురం జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ECE (4), CSE (3), సివిల్స్ (2), ఇంగ్లిష్ (1), ఫిజిక్స్ (1) ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”principal.cea@jntua.ac.in” కు తమ బయోడేటాను పంపాలని ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి తెలిపారు. ఇందుకు పీజీ అర్హత ఉంటే చాలు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.