News April 1, 2024
ఏఐతో మానవాళి అంతానికి 20శాతం ఛాన్స్: మస్క్

ఏఐతో మానవాళి పూర్తిగా అంతమయ్యేందుకు 20శాతం వరకు ఛాన్స్ ఉందని టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ అభిప్రాయపడ్డారు. ‘దానితో ఉన్న ఉపయోగాల దృష్ట్యా ఆమాత్రం రిస్క్ తీసుకోవడం తప్పదు. ఏఐను అభివృద్ధి చేయడమంటే పిల్లాడిని పెంచినట్లే. ఆ పెంపకం ఎలా ఉంటుందన్నదానిపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ నిజమే చెప్పేలా శిక్షణనివ్వడం కీలకం. ఒకసారి అబద్ధాలు మొదలుపెడితే, దానికి అంతు ఉండదు’ అని హెచ్చరించారు.
Similar News
News April 6, 2026
KKR vs PBKS మ్యాచ్కు వర్షం ముప్పు!

IPL: కాసేపట్లో ఈడెన్ గార్డెన్స్లో జరిగే KKR, PBKS మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 8 గంటలకు వర్షం పడే ఛాన్స్ 90% ఉందని, దీంతో మ్యాచ్కు అంతరాయం కలగొచ్చని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. అదే జరిగితే మ్యాచ్ రద్దయ్యి ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ వాతావరణం పొడిగా ఉన్నట్లు సమాచారం. కాగా గత ఏడాది ఈడెన్లో జరిగిన KKR-PBKS మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
News April 6, 2026
యుద్ధం.. పెరిగిన బిట్కాయిన్ ధర

పశ్చిమాసియాలో యుద్ధం విరమణకు ప్రయత్నాలు జరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్చి 25 తర్వాత తొలిసారి బిట్కాయిన్ ధర $70,000 మార్కును దాటింది. తర్వాత కొద్దిగా ఒడుదొడుకులకు లోనై ప్రస్తుతం $69,588 వద్ద ట్రేడవుతోంది. గతేడాది అక్టోబర్లో ఏకంగా $1,26,272కు చేరిన బిట్కాయిన్ ధర ఈ ఏడాది <<19063478>>ఫిబ్రవరిలో<<>> $60,033కు పడిపోయిన విషయం తెలిసిందే.
News April 6, 2026
భూమి నుంచి 4,06,773KM.. ఆర్టెమిస్-2 సరికొత్త చరిత్ర

నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,06,773KM దూరానికి చేరుకొని అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా నిలిచింది. 1970లో అపోలో-13 మిషన్ కంటే 2,500KM+ అధిక దూరం ప్రయాణించడం విశేషం. మరికొన్ని గంటల్లో వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరుకొని చుట్టూ పరిభ్రమించనున్నారు.


