News August 19, 2025
ఐదుగురు మృతి.. నివేదిక కోరిన HRC

HYD రామంతాపూర్లో విద్యుత్ షాక్తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన <<17438408>>ఘటనను <<>>రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఘటనకు కారణాలు, బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు భద్రతా చర్యలపై విద్యుత్ శాఖను నివేదిక కోరింది. సెప్టెంబర్ 22లోపు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని TGSPDCL CMDకి గడువు విధించింది.
Similar News
News August 21, 2025
రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్కు బాధ ఎందుకు: కిషన్ రెడ్డి

TG: నిన్న లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ <<17462620>>బిల్లును<<>> దేశమంతా స్వాగతిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ఎందుకు బాధ పడుతుందో అర్థం కావడం లేదన్నారు. బిల్లు విషయంలో INDI కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలన్నారు.
News August 21, 2025
సినీ కార్మికుల సమ్మెకు ఇవాళ ‘శుభం’ కార్డు?

నిర్మాతలు, సినీ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు క్లైమాక్స్కు చేరాయి. ఇవాళ మ.3 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చి సమ్మెకు శుభం కార్డు పలుకుతాయని తెలుస్తోంది. సినీ కార్మికులు షూటింగ్లు బంద్ చేయడంతో పలు సినిమాల విడుదలపై ప్రభావం పడింది.
News August 21, 2025
ఓట్ చోరీని మరిపించేందుకు బీజేపీ కొత్త ప్లాన్: CM స్టాలిన్

ఓట్ చోరీ బయటపడటంతోనే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తెచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. కక్ష సాధింపులో భాగంగా దీన్ని రాజకీయ ప్రత్యర్థులపై సంధిస్తుందని మండిపడ్డారు. ‘30 రోజులు అరెస్ట్ చేసి.. ఎలాంటి విచారణ, తీర్పు లేకుండా ఒక సీఎంను అరెస్ట్ చేస్తారా? ఇది బీజేపీ డిక్టేటర్షిప్ మాత్రమే’ అని స్టాలిన్ విమర్శించారు.