News August 19, 2025

పట్టాపాస్ పుస్తకం లేని రైతులకు ఎరువులు పంపిణీ చేయండి: NZB కలెక్టర్

image

పట్టా పాస్ పుస్తకాలు లేని రైతులు ఎవరైనా పంటలు సాగు చేస్తుంటే వారికి కూడా ఎరువులు పంపిణీ చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు. వారు పంటలు వేశారా లేదా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా ఇతర ఎరువుల కొరత లేదన్నారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News September 8, 2025

NZB: ఈ నెల 10న తుది ఓటరు జాబితా

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News September 8, 2025

NZB: రెండు కార్లు ఢీ

image

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడ వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ (M) నీలా గ్రామానికి చెందిన బలిరాం కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భైంసాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శివాజీ, బలీరాం కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బలిరాంతో పాటు వర్నికి చెందిన అనసూయ, నవీపేట చెందిన అనురాధకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

News September 7, 2025

నిజామాబాద్‌లో చంద్రగ్రహణం

image

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.