News August 19, 2025
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

TG: ‘కాళేశ్వరం’ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను నిలిపేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Similar News
News August 20, 2025
బీజేపీ సర్కార్పై సంజయ్ రౌత్ సెటైర్

కేంద్ర ప్రభుత్వంపై శివసేన లీడర్, ఎంపీ సంజయ్ రౌత్ Xలో సెటైర్ వేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఈడీ, సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్లుగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్షాలు గత కొంతకాలంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
News August 20, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

డైరెక్టర్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ నవంబర్లో ప్రారంభమవుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూట్ కోసం దీపికా పదుకొణె 100 రోజుల కాల్షీట్లు కేటాయించినట్లు పేర్కొన్నాయి. ఇందులో బన్ని ట్రిపుల్ రోల్లో నటిస్తారని, దీపిక వారియర్గా స్పెషల్ లుక్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశముంది.
News August 19, 2025
రేపు పార్లమెంట్లో J&K పునర్వ్యవస్థీకరణ బిల్లు!

జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు రేపు పార్లమెంట్లో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనుందని Republic TV తెలిపింది. హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చ మొదలుపెడతారని పేర్కొంది. కాగా J&Kకు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై స్పందన తెలపాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.