News April 1, 2024
పాలకొండ: చెరువులో పడి వ్యక్తి గల్లంతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1711964883041-normal-WIFI.webp)
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 8, 2024
REWIND: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా పర్యటనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720427760141-normal-WIFI.webp)
మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో టెక్కలి, పలాస మీదుగా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు. 2006లో నందిగం మండలం దేవలభద్ర గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 2008 జనవరి 2వ తేదీన శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన, 2008 ఏప్రిల్ 4న పలాస మండలం రేగులపాడులో ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూన్ 14 ఆమదాలవలస మండలం కృష్ణాపురం వద్ద వంశధార కెనాల్ ప్రారంభించారు.
News July 8, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి దశావతారాల్లో జగన్నాథుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720418707186-normal-WIFI.webp)
జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం, నరసన్నపేట ప్రాంతాల్లో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు సుమారు 11 రోజుల పాటు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 8న మత్స్యవతారం, 9న కూర్మావతారం, 10న వరాహవతారం, 11,12న నృసింహావతారం, 13న వామనావతారం, 14న పరశురామవతారం, 15న శ్రీరామ అవతారం, 16న బలరామ-శ్రీకృష్ణావతారం, 17న తొలి ఏకాదశి రోజున శేష పాన్పు అవతారంలో దర్శనమిస్తారు.
News July 8, 2024
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720406608387-normal-WIFI.webp)
కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 8 నుంచి 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. ఈ మేరకు అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం agnipathvayu.cdac.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.