News August 19, 2025

నాగార్జున సాగర్ ఎత్తిపోతల జలపాతం చూసొద్దాం రండి..!

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలోని ఎత్తిపోతల జలపాతం సందర్శనకు ప్రత్యేకంగా బస్సు నడుపుతున్నట్లు HYD మియాపూర్‌ డిపో మేనేజర్‌ మోహన్‌రావు ఈరోజు తెలిపారు. ఈనెల 24న ఉ.5 గంటలకు మియాపూర్‌ నుంచి బయల్దేరి జలపాతం వద్దకు వెళ్లి తిరిగి అదే రోజు రా.8 గంటలకు మియాపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఆసక్తి గల ప్రయాణికులు 8500309052 నంబర్‌కు ఫోన్‌ చేసి, టికెట్లు బుక్‌ చేసుకోవాలని, ఒక్కో టికెట్‌ ధర రూ.1,200 అని తెలిపారు.  

Similar News

News August 20, 2025

HYD: గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి

image

గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం HYD జూబ్లీహిల్స్ పరిధిలోని MCRHRDలో గణేశ్ ఉత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తామన్నారు. పోలీస్ బందోబస్తు ఉంటుందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 20, 2025

సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రికి ఓ స్పెషల్ ఆఫీసర్: హెల్త్ మినిస్టర్

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ట్రేషన్ పరంగా లోపాల నివారణకు గాను స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఓపీ బ్లాక్, ఐవీఎఫ్ సెంటర్ తదితర విభాగాలను పరిశీలించారు. పలువురు పేషంట్లతో మాట్లాడారు. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రూ.5 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

News August 19, 2025

HYD: వరుసగా వర్షాలు.. నగరంలో మురుగు పరుగులు

image

వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ HYDలో మురుగు పరుగులు పెడుతోంది. దీంతో పాదచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్, మాదన్నపేట, బాలానగర్‌లోని రాజీవ్ గాంధీనగర్, గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్, కొండాపూర్‌లోని కేఎంఆర్ ఎస్టేట్ వద్ద, బేగంపేటలోని వసంతనగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.