News August 19, 2025
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా నిర్వహించారు. వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

➤బూర్జ: రోడ్డు పరిహారం ఇవ్వలేదని వినూత్న నిరసన
➤సారవకోట: రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణం ఎలా ?
➤కవిటి: వై.ఎస్ షర్మిల దృష్టికి ఉద్ధానం కిడ్నీ రోగుల సమస్యలు
➤శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు
➤ఎస్పీ గ్రీవెన్స్కు 62 వినతులు
➤పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడు మృతి
➤నందిగాం: ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు మహిళ ఎంపిక
➤నరసన్నపేట: తెలుగు పరీక్షకు ఒక విద్యార్థి దూరం
News March 16, 2026
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 105 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని 145 కేంద్రాల్లో పరీక్షలు జరగగా 28,637 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,532 మంది హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షకు 575 మంది విద్యార్థులకు గాను 85 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.
News March 16, 2026
పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడి మృతి

పాతపట్నం – తెంబూరు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు పూరి – గుణుపూర్ రైలు ఢీకొని ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడిది ఒడిశాలోని సింగపూర్ గ్రామస్థుడు భివిషాణ్(29)గా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.


