News August 19, 2025
యాదగిరిగుట్ట ఆలయానికి నాలుగు ISO సర్టిఫికెట్లు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ISO 9001, ISO 22000తో సహా మొత్తం నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన తొలి ఆలయంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు, ప్రసాదాల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డులు వచ్చాయి. ఈ సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమక్షంలో ఆలయ అధికారులకు ఈరోజు HYDలో అందజేశారు.
Similar News
News March 11, 2026
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ: PDPL కలెక్టర్

జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేశామని, నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఆయన రంగాపూర్ లో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంకా ఎవరైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే విచారించి జారీ చేస్తామని తెలిపారు. జిల్లాలో 6,80,000 మందికి ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుందని తెలిపారు.
News March 11, 2026
నేను ఎప్పుడనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుంది: ట్రంప్

ఇరాన్పై పోరు త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడి చేయడానికి అక్కడ ఇంకేమీ మిగల్లేదన్నారు. తాను అనుకున్నప్పుడు యుద్ధం ఆగుతుందని తెలిపారు. హార్ముజ్లో బాంబులు పెట్టాలని ఇరాన్ ప్రయత్నించిందని.. కానీ తాము 16 మైన్ బోట్లను ధ్వంసం చేసి ఆ ప్లాన్ను తిప్పికొట్టామన్నారు. కాగా అంతకుముందు ఇరాన్పై దాడులు మరో రెండు వారాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు ఇజ్రాయెల్, US అధికారులు తెలిపారు.
News March 11, 2026
1,245 మంది బాలికలకు HPV వ్యాక్సిన్ వేషం

క్యాన్సర్ నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని PHC, పట్టణ, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆసుపత్రులలో జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్ఛార్జ్ అధికారి డా.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 1,649 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించామన్నారు. అందులో నేడు 1,245 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సిన్ అనంతరం వైద్యులు అమ్మాయిలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారన్నారు.


