News August 19, 2025
ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్

ఎయిర్టెల్ ₹249 ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇది అందుబాటులో ఉండదని థాంక్స్ యాప్, వెబ్సైట్లో పేర్కొంది. ఈ ప్లాన్ కింద 28 రోజులపాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1GB డేటా అందిస్తోంది. మరో 2 గంటలు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాగా ఇప్పటికే JIO సైతం ₹249 ప్లాన్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వోడాఫోన్ ఐడియా కూడా ఈ ప్లాన్ను రద్దు చేసే అవకాశముంది.
Similar News
News August 20, 2025
EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 20, 2025
ASIA CUP: ప్చ్.. శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో నెటిజన్లు BCCIపై ఫైర్ అవుతున్నారు. అయ్యర్ను BCCI రాజకీయాలకు బలి చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్, ఐపీఎల్లో 604 పరుగుల చేసిన అతడిని పట్టించుకోకపోవడం దారుణమని దుమ్మెత్తిపోస్తున్నారు. కావాలనే అతడిని తప్పించారని వాపోతున్నారు.
News August 20, 2025
కాకినాడ ఆర్మీ ర్యాలీలో తీవ్ర విషాదం

AP: కాకినాడలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో అపశృతి జరిగింది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. మృతుడిని విజయనగరం జిల్లా శ్రీహరినాయుడుపేటకు చెందిన సాయికిరణ్(20)గా పోలీసులు గుర్తించారు. గమ్యానికి 100 మీటర్ల దూరంలో సాయి ఆయాసంతో పడిపోయాడు. వెంటనే కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. కానీ కాసేపటి తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయాడు.